21, డిసెంబర్ 2022, బుధవారం

మొలకల పున్నమి - వేంపల్లి గంగాధర్

➦ రాయలసీమ బతుకు దర్పణం - మొలకల పున్నమి




బతుకు నిండా కన్నీళ్ళు ఉన్నాయి అని చెప్పడం కంటే ఆ కన్నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో, ఎలా జీవితాలని నడిపిస్తున్నాయో, కుదిపేస్తున్నాయో, ఎవరిచేత ఆ కన్నీళ్ళు రాలుతున్నాయో, ఎవరు బాధింపబడుతున్నారో,ఆ కన్నీళ్ల వాసన,రంగు,రాలిన విధానం… ఇవన్నీ చూపుడువేలితో  రచైత చూపించాలి. పీడిత వర్గాల వైపు నిలబడి,తమ ప్రాంత జీవన విధానాన్ని,భాషా పలుకుబడిని,ఈ రాజ్యంలో స్థితి ఇదేనన్న ముద్రను తుడిచిపెట్టి ఎవరూ చూడని కొత్త కోణంలోంచి కథలు రాస్తే అదే మంచి సాహిత్యం అని నా ఫీలింగ్.
రాయలసీమ ప్రాంతం నుంచి చాలానే సాహిత్యం వచ్చింది. అక్కడ జీవనశైలి, వర్షాలు లేని దుస్థితి, మనుషులు, వాతావరణం ఇవే ఎక్కువగా రాయబడ్డాయి.
కరువు కాటకాలు మధ్య కుక్కబడ్డ జీవితాలుగా, ఫ్యాక్షనిజం ప్రవహించే ప్రాంతంగా పరిగణించే రాయలసీమ ప్రాంతంలోంచి ఎవరికి తెలియని కోణాల్లో చూడగలిగిన కథలు వేంపల్లి గంగాధర్ రాసిన 'మొలకల పున్నమి'. 2011కు గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. మొత్తం 13 కథలు. ఒక్క కథలో protagonist చెప్పే ముచ్చట్లు అలివిగానివి. ప్రతీ కథలో చిత్రించే వాతావరణం, కథా శైలి, సంఘటనలు, ఎత్తుకు పై ఎత్తులు, narration కళ్ళు మూయనివ్వవు.
రచైత రచనా పద్ధతి ఎంత సౌందర్యాన్ని పరిమళింపజేస్తుంది. Poetical line లు వాడుతూ, రాయలసీమ ప్రాంతంలో మాట్లాడే డైలక్ట్ ని పాత్రల్లోకి ఒంపి కథను వర్ణించే తీరు ఒక elixir ఫీలింగ్ కలిగిస్తుంది. ఇలాగ కథ రాయడంలో నాకు సమ్మెట ఉమాదేవి గారు,గోపిని కరుణాకర్ బాగా ఇష్టం. కథని కవితాత్మకంగా నడపడం గొప్ప టెక్నిక్.
*
'యామయ్య సామి గుర్రం' వేసుకుని ఏ ఊరికి వెళ్ళి అక్కడ ప్రదర్శన చేస్తే అక్కడ మోడాలు (మేఘాలు) కరిగి వర్షం కురుస్తుందన్న ప్రజల విశ్వాసాన్ని చిత్రించాడు. ఆ విన్యాసాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
Love stories లో 
నాకు ఫేవరెట్ గా మారిన కథల్లో 'శిలబండి', 'మొలకల పున్నమి' కతలు. శిలబండి కథ చదువుతూ ఉంటే నాకు గోపిని కరుణాకర్ రాసిన 'బారతం బొమ్మలు' కథల సంపుటిలోని 'కానుగపూల వాన' గుర్తొచ్చింది. గుండెల్ని తడిగా మార్చిన కథ. ఊహకు అందకుండా నడిచే ఇంకో ప్రేమ కథ 'మొలకల పున్నమి'.
రైతుల అవస్థ గురించి కథల్లో ఏదోక సందర్భంలో, సంఘటనలో మాట్లాడతాడు. అందులో ఆధునికతకు దగ్గరగా అనిపించిన కథ 'మూడు పదున్ల వాన'. రైతు కన్నీళ్ల రుచి చూపించింది.
డేగల రాజ్యం కథలో రాజకీయాలు రాయలసీమలో తెచ్చిన వ్యధలు,వధలు పూసుగుచ్చినట్టు చెప్తాడు. ఎవరు ఏనుగులు మీదకెక్కడానికి ఎన్ని చిన్నెలు వేస్తారో,బలయ్యే వర్గాలు ఏమిటో బలంగా చూపెట్టాడు. అలాగే దొరల దారుణమైన పెత్తనాలని చూపించే కథ 'ఏడులాంతర్ల సెంటరు'.
మనుషులెంత ఆశా జీవులో చెప్పే కథ 'దింపుడు కల్లం ఆశ'. ఊరిని కంటికి రెప్పలా చూసుకున్న మనీషి ధర్మారెడ్డి చనిపోతే అక్కడ చుట్టూ ఊర్ల దుఃఖం, దింపుడు కల్లం దగ్గర బతుకుతాడేమోనన్న ఆశ కన్నీళ్ల పర్యంతం చేస్తుంది.
'మైనం బొమ్మలు' లంబాడీ జీవితాల్లో కొత్త కోణాన్ని చూపించింది. సమ్మెట ఉమాదేవి రేలపూలు,జమ్మిపూలు కథలు చదివినంత భావన కలిగింది.
మనుషులని స్మరణ చేసుకుని ఆ ఆప్యాయతని,జీవన విధానాన్ని, కన్నీళ్ల లోయలని,కన్న బిడ్డను బాగా చూసుకోవాలని జానకమ్మ లాంటి ఎందరో  పూల మనుషుల కష్టాన్ని,పూల మాల కట్టినంత అందంగా రాశాడు. ముగింపు టర్నింగ్ పాయింట్.
అభివృద్ధి పేరుతో ఊర్లని ఎలా నాశనం చేస్తారో,అధికారుల లోభితనం,ధన కక్కూర్తిని, ఏం సదుపాయం లేక రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న 'దొమ్మరపాళెం' గ్రామం ద్వారా చూపిస్తాడు. ఇందులో సహృదయుడైన వీరయ్య తాత పాత్ర విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భాలు గురించి పల్లిపట్టు నాగరాజు యాలై పూడ్సింది అనే కవితలో
'దేశం లోపల దొరల సంగతేందీ..?
.
తెలుపు గురించి మాట్లాడే ముందు
నలుపు గురించి కూడా మాట్లాడాలి
వ్యధను గురించి మాట్లాడే ముందు
వధను గురించి కూడా మాట్లాడాలి '
అన్న కవితా పంక్తులు వీరయ్య తాత లేఖలో గమనించొచ్చు.
చిట్టచివరిగా 'మంత్రసాని వైద్యం' కన్నీళ్ళతో మొదలై కొత్త పొద్దుతో ముగుస్తుంది. 
కథల్ని చాలా వరకు summarize కావాలనే చేయలేదు. ఎందుకంటే ఫలానా కథలో సారాంశం ఇంతే అని చెప్పడానికి రచయిత విధానం అంతా ఇంతా కాదు. అది శోచనీయమైన అభివ్యక్తి, శైలి.

*

“If literature truly possesses a mysterious power, I think perhaps it is precisely this: that one can read a book by a writer of a different time, a different country, a different race, a different language, and a different culture and there encounter a sensation that is one's very own.”
―  అంటాడు చైనా రచయిత Hua You.
అతనన్నట్టుగా పై వాక్యాలు ఈ పుస్తకానికి సరిపోతాయి. ఎందుకంటే ఈ పుస్తకంలో ఓ చారిత్రక నేపథ్యం ఉంది,కాలం వుంది, రాయలసీమ జీవుల వ్యధలు, కన్నీళ్ళున్నాయి, అక్కడ మాట్లాడే మాండలికముంది, సంస్కృతి ఉంది. సామాజిక, రాజకీయ,ప్రాంత పరిస్థితులను బాగా పరిశీలించి మనముందు కుప్పపోసిన కథలు. 
You'll definitely cuddle this book
😍
~
లిఖిత్ కుమార్ గోదా 


20, డిసెంబర్ 2022, మంగళవారం

మైరావణ - ప్రసాద్ సూరి (సూరాడ)

➤ జానపద కథానాయకుడు అను 'మైరావణ'

@ ప్రసాద్ సూరి -(A short note)

~

'సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. మారితే రెండు ప్రమాదాలు.

ఒకటి కాదనలేవు

రెండు నిరూపించలేవు.'



ఇవి ప్రసాద్ సూరి రాసిన 'మైరావణ' నవల Opening line లు. మనం పెద్దగా opening lines గురించి చర్చించం. కానీ చాలా మటుకు అదే ఆ రచనకు పునాది. చాలా వరకు ఇంగ్లీష్ రచనల్లో ఈ ప్రధానమైన విషయం మనకు తెలుస్తుంది. ఈ నవల మొత్తాన్ని కూడా పైన quote చేయబడిన వాక్యాలతో ముందుకు నడిపిస్తాడు. ఆ వాక్యాలని నిరూపిస్తాడు కూడా. 



అచ్చంగా కె.జి.ఎఫ్ తరహాలో సినిమా చూసినంత ఫీలింగ్. A youngster writing about a gangster. కాకపోతే ఇది అస్థిత్వాన్ని చూపించే నవల. చేపలు పట్టడం,పాటు (చేపల వేట),వాడోళ్ళకు మాత్రమే పరిమితమైన పదాలు. వీటన్నింటినీ కేవలం డాక్యుమెంట్ మాత్రమే చేయలేదు. ప్రతీ సంఘటనలో మనల్ని పుట్టులో కూర్చోబెట్టి కథను చూపిస్తాడు.


కాలాన్ని డాక్యుమెంట్ చేయగలగడం సాహిత్యంలో గొప్ప విషయం. ఆ పని సూరి చేశాడు. తన కాలాన్ని,తన ముందు బతికిన తాతల కాలాన్ని,సముద్ర ఆధారిత జీవుల పోరాటాన్ని,మనుగడని, అస్థిత్వాన్ని,దుస్థితి, నేపథ్యాన్ని ఇంకా చాలా చాలా.


నవల ఒక వైపు మైరావణుడు గురించి సాగుతుంది. సీన్ కట్టై మళ్ళీ ఎక్కడో జైల్లో ఉన్న ఎనబై ఏళ్ల KKR దగ్గర, అక్కడ కట్టై పోలీస్ అశోక్ దగ్గర, అక్కడినుంచి రిపోర్టర్ మాహి త్యాగి దగ్గర కథను కొన్ని సినిమా సీన్లు చూపించినట్లు చూపిస్తుంటాడు. దేశంలో ప్రస్తుతం రాజకీయాల విష వలయాల గురించి, ప్రజల పక్షాన ఉండాల్సిన మీడియా దుర్మార్గమైన ప్రభుత్వాల మోచేతి నీళ్లు తాగుతూ భజనలు, Fake news లు spread చేస్తున్న దృశ్యాలు కళ్ళకు కట్టినట్లు చూపించాడు.లెఫ్టిస్టుల మీద ఎన్ని కుట్రలు పన్ని వాళ్ళు కోరుకునే ప్రశాంతతని, స్వేచ్ఛని వాళ్ళకే లేకుండా జైళ్ళల్లో ఎలా హింసిస్తారో కూడా రాశాడు. 


 ఇందులో ముఖ్యంగా నన్ను ఆకర్షించిన పాత్రలు మైరావణుడి తల్లి గైరమ్మ కథ. తాత నూకన్న కథ. కాలంలో మూడు తరాల కథల్ని పట్టి చూపించాడు. 


1924లో ఒక సంఘటన -

తన తండ్రిని కొడుతున్నాడన్న నెపంతో బ్రిటిష్ సోల్జర్ ని చంపి, అమ్మమ్మ దగ్గరికి పారిపోతే ఆమె నూకన్నని రంగూన్ పంపిస్తుంది. పదిహేనేళ్ల పిల్లోడి దగ్గర నుండి మంచి కుర్రకారు వయసుకు వచ్చే దాకా అక్కడే తన రైతు కుర్రోళ్ళతో బతకడం, ద్రౌపది వస్త్రాపహరణం నాటకంలో భీముడి వేషం వేసినప్పుడు తననే తదేకంగా చూసిన రంగూన్ పిల్ల 'తార' నచ్చడం. ఇద్దరూ కలవడం. రెండవ ప్రపంచ యుద్దం మొదలవుతుందని వాళ్ళు నమ్మే దేవుడు ద్వారా తెలీడంతో తార నూకన్నకి ఒక బరిణె ఇచ్చి పంపించడం,వేల కిలోమీటర్లు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని నడవడం, దారిలో నరకం ఎలా ఉంటుందో చూడడం (మనకీ చూపిస్తాడు),తార ఇచ్చిన బరిణె పోగొట్టుకోవడం, తిరిగి సొంత దేశం వచ్చి బ్రతకడం,గైరమ్మ పుట్టాక ఒక అవమానం వల్ల ఇళ్ళు వదిలిపోవడం ఇదీ నూకన్న కథ. చివరికెప్పుడో కనిపిస్తాడు.


*


గైరమ్మ కష్టాలు, కుటుంబ పోషణ, కన్నీళ్ళు చూపిస్తాడు. గాబ్రియేల్ గార్షియా మార్క్వేజ్ - One Hundred years of Solitude నవలలో బువాందియాల ఒక్క కుటుంబంతో మెకాండో ఊరు ఏర్పడినట్లు, గైరమ్మ వాళ్ళ ఊరు ఎలా ఏర్పడిందో చెప్తాడు. 


*


అనేక జానపద కథలు, పురాణ మహిరావణుడి కథ - అదే మైరావణుడి కథ, ఊర్లలో ఓట్రించుకుంటూ ఎదుగుతున్న మనుషులమీద ఊరోళ్ళు ఎన్ని పుకార్లు కహానీలు నిందలు పుట్టిస్తారో ఆ మనస్థత్వాలని దగ్గరగా చూపిస్తాడు. ఉల్లిపొరల్లా సాగే ఈ నెరేషన్ విసుగను రానివ్వదు. 


అసలు మైరావుడి కథ చదువుతున్నంత సేపు కొన్ని bgms పుడతాయి. అదీ ప్రేమ విషయంలో కానీ, ఓ గ్యాంగ్ లీడర్ లా తారసపడ్డప్పుడు గాని ఎప్పుడైనా. మైరావుడి ఎంట్రీనే అటు జానపద కథలో చదువుతున్న, లింగాన్ని ఎత్తేటప్పుడు చదువుతున్నా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాడబలిజ ఐన మైరావణుడు అలియాస్ జగన్నాథ రావ్ చేపలు పట్టడం దగ్గర నుంచి దేశంలో పేరుమోసిన గ్యాంగ్ స్టార్ దాకా ఎలా ఎదిగాడు అనేది కథ. తను కల కన్న చెంఘీజ్ ఖాన్ లాగ తను మారాడా లేదా అన్నది కథ. మొత్తానికి ప్రసాద్ సూరి Magical Realismలో కొత్తదైన శైలితో ఒక తోపు నవల రాశాడు.


*


ఈ కాలానికి ఇది అవసరమైనది. కొత్త పాత కలిపి మంచి నవల రూపొందించి కొత్త రచయితలకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూపించాడు. చారిత్రక, సామాజిక, ఆర్థిక విషయాలను ఇందులో చోడించడం గొప్ప flavour అందిస్తుంది. తప్పక చదవాల్సిన పుస్తకం. Love you Prasad Suri Anna 💜💜


మొన్నటి దాకా సూరి చింరంజీవే. కానీ ఇప్పుడు పరకాయ ప్రవేశం చేసి మైరావణుడయ్యాడు. తన writing style లోని పరివర్తనం great. 


ప్రసాద్ సూరి Readability చదవకుండా ఆపలేం. ఒకసారి challenge చేయండి అందరూ 😊


~


19-12-2022