ప్రసాద్ సూరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రసాద్ సూరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, డిసెంబర్ 2022, మంగళవారం

మైరావణ - ప్రసాద్ సూరి (సూరాడ)

➤ జానపద కథానాయకుడు అను 'మైరావణ'

@ ప్రసాద్ సూరి -(A short note)

~

'సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. మారితే రెండు ప్రమాదాలు.

ఒకటి కాదనలేవు

రెండు నిరూపించలేవు.'



ఇవి ప్రసాద్ సూరి రాసిన 'మైరావణ' నవల Opening line లు. మనం పెద్దగా opening lines గురించి చర్చించం. కానీ చాలా మటుకు అదే ఆ రచనకు పునాది. చాలా వరకు ఇంగ్లీష్ రచనల్లో ఈ ప్రధానమైన విషయం మనకు తెలుస్తుంది. ఈ నవల మొత్తాన్ని కూడా పైన quote చేయబడిన వాక్యాలతో ముందుకు నడిపిస్తాడు. ఆ వాక్యాలని నిరూపిస్తాడు కూడా. 



అచ్చంగా కె.జి.ఎఫ్ తరహాలో సినిమా చూసినంత ఫీలింగ్. A youngster writing about a gangster. కాకపోతే ఇది అస్థిత్వాన్ని చూపించే నవల. చేపలు పట్టడం,పాటు (చేపల వేట),వాడోళ్ళకు మాత్రమే పరిమితమైన పదాలు. వీటన్నింటినీ కేవలం డాక్యుమెంట్ మాత్రమే చేయలేదు. ప్రతీ సంఘటనలో మనల్ని పుట్టులో కూర్చోబెట్టి కథను చూపిస్తాడు.


కాలాన్ని డాక్యుమెంట్ చేయగలగడం సాహిత్యంలో గొప్ప విషయం. ఆ పని సూరి చేశాడు. తన కాలాన్ని,తన ముందు బతికిన తాతల కాలాన్ని,సముద్ర ఆధారిత జీవుల పోరాటాన్ని,మనుగడని, అస్థిత్వాన్ని,దుస్థితి, నేపథ్యాన్ని ఇంకా చాలా చాలా.


నవల ఒక వైపు మైరావణుడు గురించి సాగుతుంది. సీన్ కట్టై మళ్ళీ ఎక్కడో జైల్లో ఉన్న ఎనబై ఏళ్ల KKR దగ్గర, అక్కడ కట్టై పోలీస్ అశోక్ దగ్గర, అక్కడినుంచి రిపోర్టర్ మాహి త్యాగి దగ్గర కథను కొన్ని సినిమా సీన్లు చూపించినట్లు చూపిస్తుంటాడు. దేశంలో ప్రస్తుతం రాజకీయాల విష వలయాల గురించి, ప్రజల పక్షాన ఉండాల్సిన మీడియా దుర్మార్గమైన ప్రభుత్వాల మోచేతి నీళ్లు తాగుతూ భజనలు, Fake news లు spread చేస్తున్న దృశ్యాలు కళ్ళకు కట్టినట్లు చూపించాడు.లెఫ్టిస్టుల మీద ఎన్ని కుట్రలు పన్ని వాళ్ళు కోరుకునే ప్రశాంతతని, స్వేచ్ఛని వాళ్ళకే లేకుండా జైళ్ళల్లో ఎలా హింసిస్తారో కూడా రాశాడు. 


 ఇందులో ముఖ్యంగా నన్ను ఆకర్షించిన పాత్రలు మైరావణుడి తల్లి గైరమ్మ కథ. తాత నూకన్న కథ. కాలంలో మూడు తరాల కథల్ని పట్టి చూపించాడు. 


1924లో ఒక సంఘటన -

తన తండ్రిని కొడుతున్నాడన్న నెపంతో బ్రిటిష్ సోల్జర్ ని చంపి, అమ్మమ్మ దగ్గరికి పారిపోతే ఆమె నూకన్నని రంగూన్ పంపిస్తుంది. పదిహేనేళ్ల పిల్లోడి దగ్గర నుండి మంచి కుర్రకారు వయసుకు వచ్చే దాకా అక్కడే తన రైతు కుర్రోళ్ళతో బతకడం, ద్రౌపది వస్త్రాపహరణం నాటకంలో భీముడి వేషం వేసినప్పుడు తననే తదేకంగా చూసిన రంగూన్ పిల్ల 'తార' నచ్చడం. ఇద్దరూ కలవడం. రెండవ ప్రపంచ యుద్దం మొదలవుతుందని వాళ్ళు నమ్మే దేవుడు ద్వారా తెలీడంతో తార నూకన్నకి ఒక బరిణె ఇచ్చి పంపించడం,వేల కిలోమీటర్లు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని నడవడం, దారిలో నరకం ఎలా ఉంటుందో చూడడం (మనకీ చూపిస్తాడు),తార ఇచ్చిన బరిణె పోగొట్టుకోవడం, తిరిగి సొంత దేశం వచ్చి బ్రతకడం,గైరమ్మ పుట్టాక ఒక అవమానం వల్ల ఇళ్ళు వదిలిపోవడం ఇదీ నూకన్న కథ. చివరికెప్పుడో కనిపిస్తాడు.


*


గైరమ్మ కష్టాలు, కుటుంబ పోషణ, కన్నీళ్ళు చూపిస్తాడు. గాబ్రియేల్ గార్షియా మార్క్వేజ్ - One Hundred years of Solitude నవలలో బువాందియాల ఒక్క కుటుంబంతో మెకాండో ఊరు ఏర్పడినట్లు, గైరమ్మ వాళ్ళ ఊరు ఎలా ఏర్పడిందో చెప్తాడు. 


*


అనేక జానపద కథలు, పురాణ మహిరావణుడి కథ - అదే మైరావణుడి కథ, ఊర్లలో ఓట్రించుకుంటూ ఎదుగుతున్న మనుషులమీద ఊరోళ్ళు ఎన్ని పుకార్లు కహానీలు నిందలు పుట్టిస్తారో ఆ మనస్థత్వాలని దగ్గరగా చూపిస్తాడు. ఉల్లిపొరల్లా సాగే ఈ నెరేషన్ విసుగను రానివ్వదు. 


అసలు మైరావుడి కథ చదువుతున్నంత సేపు కొన్ని bgms పుడతాయి. అదీ ప్రేమ విషయంలో కానీ, ఓ గ్యాంగ్ లీడర్ లా తారసపడ్డప్పుడు గాని ఎప్పుడైనా. మైరావుడి ఎంట్రీనే అటు జానపద కథలో చదువుతున్న, లింగాన్ని ఎత్తేటప్పుడు చదువుతున్నా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాడబలిజ ఐన మైరావణుడు అలియాస్ జగన్నాథ రావ్ చేపలు పట్టడం దగ్గర నుంచి దేశంలో పేరుమోసిన గ్యాంగ్ స్టార్ దాకా ఎలా ఎదిగాడు అనేది కథ. తను కల కన్న చెంఘీజ్ ఖాన్ లాగ తను మారాడా లేదా అన్నది కథ. మొత్తానికి ప్రసాద్ సూరి Magical Realismలో కొత్తదైన శైలితో ఒక తోపు నవల రాశాడు.


*


ఈ కాలానికి ఇది అవసరమైనది. కొత్త పాత కలిపి మంచి నవల రూపొందించి కొత్త రచయితలకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూపించాడు. చారిత్రక, సామాజిక, ఆర్థిక విషయాలను ఇందులో చోడించడం గొప్ప flavour అందిస్తుంది. తప్పక చదవాల్సిన పుస్తకం. Love you Prasad Suri Anna 💜💜


మొన్నటి దాకా సూరి చింరంజీవే. కానీ ఇప్పుడు పరకాయ ప్రవేశం చేసి మైరావణుడయ్యాడు. తన writing style లోని పరివర్తనం great. 


ప్రసాద్ సూరి Readability చదవకుండా ఆపలేం. ఒకసారి challenge చేయండి అందరూ 😊


~


19-12-2022

18, జూన్ 2022, శనివారం

మై నేమ్ ఈజ్ చిరంజీవి - ప్రసాద్ సూరి

 Cuddled Book -2 

'జులాయి మేధావి' అను ఒక చిరంజీవి కత


 


   ఈ మధ్య నేను చదివిన మంచి నవల లో ప్రసాద్ సూరి రాసిన 'మై నేమ్ ఇస్ చిరంజీవి' ఒకటి. ఈ పుస్తకం ఛాయా పబ్లికేషన్స్ నుంచి వెలువడింది. 35 ఏళ్ళ వయసున్న యువకుల రచనలు పబ్లిష్ చేస్తున్నారంటే ఏముంటుందో అనుకున్నాను ఫేస్బుక్లో ఈ పుస్తకానికి సంబంధించిన ఒక పోస్టు చూసి. మిత్రుడు Ramesh Karthik Nayak సజెస్ట్ చేసాడని 34వ నేషనల్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఈ పుస్తకాన్ని కొన్నా. 21 ఏళ్లకే ఎలా రాసి ఉంటాడు ఓ నవల? ఒక పబ్లిషర్ దానిని నమ్మి ఎలా పబ్లిక్ చేసి ఉంటాడు? ఏమ్ ఉండొచ్చు ఇందులో కథ అని ఓ ఎక్స్పెక్టేషన్ తో చదవడం మొదలెట్టాను. ఎందుకంటే కొత్తగా పుట్టుకొచ్చిన యువకుల నవలల్లో నేను చదివినా రెండో నవల ఇది. మొదటిది గూండ్ల వెంకట నారాయణ రాసిన #భూమి_పతనం.

నా ఈడు వయసు ఉన్న వాళ్లు ఏం రాస్తున్నారు అనేదే ఆత్రుత.


Author - Prasad Suri


   నవలని రచయిత 2030 లో నడిపిస్తాడు. తన ఇష్టం వచ్చినట్లు సంతోషంగా, ఫ్రీడంతో బతుకుతున్న చిరంజీవి అనే ఓ కథానాయకుడికి(బహుశా ఇది రచయిత స్వీయ జీవితం అయ్యుండొచ్చు) Whatsapp లో వాళ్ళ టెన్త్ క్లాస్ బ్యాచ్ లో ఒక ఫ్రెండ్ Group క్రియేట్ చేసి Get together ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించుకోవడం, చిరంజీవి ఓ ప్రయాణంలో ఉండడం, అలా తన జీవితాన్ని పుట్టుక దగ్గర నుండి, ఫ్యామిలీ, వూరు మనుషులు దగ్గర నుండి ఇంటర్మీడియట్ వరకు, కాలేజ్ లో, హాస్టల్లో తను గడిపిన Life (పక్కా Mass Attitude)ని రాసాడు. ఇందులో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, Teenage అబ్బాయికి అమ్మాయిలపై అట్రాక్షన్ కలిగే సందర్భాలు, లవ్ స్టోరీ లు, హాస్టల్ లో కొన్ని పొలిటికల్ గొడవలు, మామూలు గొడవలు ఇలా సాగుతుంది నవల అంతా. భాష పరంగా 'చదువుకున్న ఒక మాస్ యాటిట్యూడ్ ఫెలో' ఎలా మాట్లాడతాడో అలా మొదటి నుంచి చివరి దాకా కథను మనతో చెబుతాడు. 


        చదువుతున్నంత సేపు ఎలాంటి బోరింగ్ లేకుండా, కళ్ళు మనసు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో దూసుకెళ్ళాయి. High readability ఉన్న నవల.ఈ నవలలో కొన్ని సందర్భాలలో నాకు నేను కనిపించాను. 


    ఇందులో విజయశాంతి, సలోమి, సువార్త, సత్యవతి లవర్స్ గా, తన Love proposal rejected persons గా మనకు కనిపిస్తారు. అమ్మాయిలకు సైట్ కొట్టడం,అవసరమైన సందర్భాలలో Attitude చూపించడం, కాలేజ్ నంత తన నాలెడ్జితో తన వైపు తిప్పుకోవడం, రకరకాల ఫ్రెండ్ షిప్ లు, అన్నీ మనం ఇందులో చూస్తాం.

   అంతా చదవడం పూర్తయ్యాక చిరంజీవి 'జులాయి మేధావి' అని అర్థమవుతుంది మనకి.


   నిజంగా యూత్ నుండి ఇలాంటి మరెన్నో నవలలు రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి టీనేజ్ అబ్బాయి చేసే పనులు, చేస్తున్న పనులే ఇవన్నీ. ఇలాంటి లైఫ్ చాలామంది గడిపే ఉంటారు. కానీ రాసి ఉండకపోవచ్చు. ఆ పని ప్రసాద్ సూరి చేశాడు.


 I enjoyed a lot when I am reading this novel.

Lots of love to Prasad Suri Anna..


(Note:- పుస్తకాన్ని చదివిన తర్వాత రాసుకున్న వాక్యాలు యథాతథంగా. దాదాపు 6 నెలలు అవుతోంది ఇది రాసుకుని )

Click here 

Facebook Post (My Timeline)